ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday August 13, 2021
మేడిపల్లి, ఆగస్టు12 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కోన్నారు. హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కాప్రా కస్టోడియన్ భూముల వ్యవహారంలో తనపై తప్పుడు అరోపణలు చేసిన వ్యక్తుల పై పరువు నష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులకు అండగా నిలిచామని అయన తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రసార మాధ్యమాలు వాస్తవాలను ప్రజలకు తెలపాలని అయన కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గాయం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.