బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న చేయడం జరుగుతుందని యాదిష్ తెలిపారు
Published: Thursday June 09, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 8 ప్రజాపాలన ప్రతినిధి.
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యువమోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టి యాదిష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం టౌన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది యాదిష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బండి సంజయ్ పిలుపుమేరకు భాను ప్రకాష్ గా సహకారంతో యాదిష్ ఆధ్వర్యంలో ఈనెల పదోవ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున నాలుగు మండలాల నుంచి యువ మోర్చా నాయకులు ఈ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుచున్నాం... ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి ఇస్తున్న నిధులను ప్రజల్లోకి విస్తృత ప్రచారం కల్పించాలని యువ మోర్చా నాయకులు కోరుతున్నారు బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు తో అభివృద్ధి జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుప్పాల శాంతికుమార్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ మహేందర్ రెడ్డి శశి ఇ పవన్. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: