క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మానం

Published: Wednesday January 04, 2023
* రాష్ట్ర లగోరి ప్రధాన కార్యదర్శి పెద్దింటి నవీన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 03 జనవరి ప్రజా పాలన : 2017 నుండి 2023 వరకు క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర లగోరీ ప్రధాన కార్యదర్శి పెద్దింటి నవీన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  2023 జనవరి 11 బుధవారం కొండాబాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో ఉదయం 10 గంటలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. అండర్ 14 అండర్ 17 అండర్ 19 సీనియర్ ( బాలబాలికలకు ) క్రీడాకారులకు వివిధ అంశాలలో పాల్గొన్న వారందరికీ సన్మానం చేయనున్నామని చెప్పారు. వాలీబాల్ కబడ్డీ ఖో ఖో హాకీ క్రికెట్ లగోరి సైక్లింగ్ మల్లఖంబ జూడో టైక్వాండో కరాటే బాల్ బ్యాడ్మింటన్ అథ్లెటిక్స్ త్రో బాల్ హ్యాండ్ బాల్ ఫుట్బాల్ షూటింగ్ బాల్ రెస్ట్లింగ్ తదితర ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికి సన్మానం నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. సన్మానం పొందగోరు క్రీడాకారులు 2023 జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు రాష్ట్ర లగోరి ప్రధాన కార్యదర్శి పెద్దింటి నవీన్ కుమార్ ఫోన్ నెంబర్ 9014 222 830 కు సంప్రదించాలని కోరారు.