కేశవపట్నం ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే

Published: Thursday February 02, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 01 ప్రజాపాలన ప్రతినిధి:


శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం ఉన్నత పాఠశాలలో బుధవారం మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 23 లక్షల నిధులతో పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, ఓపెన్ హాల్ నిర్మాణాలను ప్రారంభించారు. అదే విధంగా  కేశవపట్నం యువకుల కోరిక మేరకు 4లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు కొరకు భూమి పూజ చేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కీ, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఉమేంతలా సరోజన, ఉప సర్పంచ్ గజ్జెల్లి హన్మంతు, గ్రామ వార్డు సభ్యులకు గ్రామ యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ లు బొజ్జ కవిత, ఎనుగుల అనిల్, రైతు బందు సమితి సభ్యుడు కొత్తపల్లి రవి, కో ఆప్షన్ సబ్యుడు గుర్రం రామస్వామి, పాఠశాల హెచ్ఎం మమత గౌతమి, అధ్యాపక సిబ్బంది, పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.