నూతనబాధ్యతలుస్వీకరించిన తహశీల్దార్
రాయికల్, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల నూతన తహశీల్దార్ గా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై రాయికల్ మండల తహసిల్దారుగా (ఇక్కడికి) వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వసంక్షేమపథకాలు కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. రెవెన్యూసిబ్బంది అందరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.రాయికల్, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల నూతన తహశీల్దార్ గా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాద్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై రాయికల్ మండల తహసిల్దారుగా (ఇక్కడికి) వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వసంక్షేమపథకాలు కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. రెవెన్యూసిబ్బంది అందరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Share this on your social network: