మాట తప్పని మడమ తిప్పని కార్పోరేటర్ బండి రమ్య సతీష్

Published: Tuesday August 10, 2021
కీ.శే బండి జంగయ్య గౌడ్ జ్ఞాపకార్థం కమ్యూనిటీ హాల్
రూ. 25 లక్షల సొంత ఖర్చుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం
16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ వెల్లడి
మేడిపల్లి, ఆగస్టు 9 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కార్పొరేటర్ బండి సతీష్ గౌడ్ ల ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా శ్రీరామ ఆర్టీసీ కాలనీ పేస్ 2, తదితర కాలనీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తన తండ్రి కీర్తిశేషులు బండి జంగయ్య గౌడ్ జ్ఞాపకార్థం తన సొంత ఖర్చుతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన కమ్యూనిటీ హాల్. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లు మాట్లాడుతూ మా తండ్రి కీర్తిశేషులు బండి జంగయ్య గౌడ్ జ్ఞాపకార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రతి నిత్యం 16వ డివిజన్ ప్రజల అడుగుజాడల్లో అడుగు వేస్తూ, వారి శ్రేయస్సే మా కర్తవ్యంగా, వారి అభివృద్ధే మా పనిగా పెట్టుకొని డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రీరామ ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆ కాలనీలో ఉన్నటువంటి ఖాళీ జాగాలో సుమారుగా రూ. 25లక్షల రూపాయల ఖర్చుతో తన సొంత ఖర్చుతో సుమారుగా 1300 స్క్వేర్ ఫీట్ స్లాబ్ తో సహా కమ్యూనిటీ హాలు కట్టించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా పెట్టామని, అతిత్వరలోనే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తదితరుల చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీ రామ ఆర్టీసీ కాలనీ కమిటీ నేతలు ప్రజలు మాట్లాడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బండి రమ్య సతీష్ గౌడ్ లు మాకు కార్పొరేటర్ గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. రాజకీయాలలో హామీలు ఇవ్వడం మర్చిపోవడం రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులకు వెన్నతోపెట్టిన విద్యా కానీ ఒక సంవత్సరం అటు ఇటు మాకు ఇచ్చిన హామీ మేరకు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.