పట్టణ అభివృద్ధే ప్రథమ లక్ష్యం

Published: Wednesday December 15, 2021
వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర
వికారాబాద్ బ్యూరో 14 డిసెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ప్రథమ లక్ష్యంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని రైల్వే బ్రిడ్జి నుండి హైదరాబాద్ వేళ్ళే ప్రధాన రహదారి మార్గంలో పారిశుద్ధ్య పనులు, మొక్కలకు సపోర్ట్ కట్టెలు కట్టి జాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ కు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు పట్టణం అందంగా కనిపించేటట్లు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.