పూజలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్..

Published: Monday June 20, 2022
తల్లాడ(కల్లూరు), జూన్ 18 (ప్రజాపాలన న్యూస్):
కల్లూరు పట్టణంలో రామనగర్ వీధిలో బత్తుల దుర్గారావు,గండికోట గురవయ్య నివాస ప్రాంగనాలలో ఏర్పాటు చేసుకున్న ఉప్పలమ్మ,ఎల్లమ్మ తల్లి పవిత్ర పూజ కార్యక్రమాల్లో  జిల్లా తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వడ్డెరరాజు సంఘం జిల్లా అధ్యక్షులు ఆళ్ళకుంట నరసింహారావు,బత్తుల రామారావు,గండికోట కృష్ణ,చిన్నా,గోవర్ధన్, బొడ్డు ప్రసాద్ గౌడ్, కంభంపాటి వెంకయ్య నాయుడు మరియు మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు.