పూజలో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్..
Published: Monday June 20, 2022
తల్లాడ(కల్లూరు), జూన్ 18 (ప్రజాపాలన న్యూస్):
కల్లూరు పట్టణంలో రామనగర్ వీధిలో బత్తుల దుర్గారావు,గండికోట గురవయ్య నివాస ప్రాంగనాలలో ఏర్పాటు చేసుకున్న ఉప్పలమ్మ,ఎల్లమ్మ తల్లి పవిత్ర పూజ కార్యక్రమాల్లో జిల్లా తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వడ్డెరరాజు సంఘం జిల్లా అధ్యక్షులు ఆళ్ళకుంట నరసింహారావు,బత్తుల రామారావు,గండికోట కృష్ణ,చిన్నా,గోవర్ధన్, బొడ్డు ప్రసాద్ గౌడ్, కంభంపాటి వెంకయ్య నాయుడు మరియు మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: