అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు
Published: Saturday October 29, 2022
మధిర అక్టోబర్ 28 (ప్రజా పాలన ప్రతినిధి)
మధిర పట్టణంలోని లడక్ బజార్ అయ్యప్ప నగర్లో వేంచేసియున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసంలోశుక్రవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఈరోజు అన్నదానం కార్యక్రమాన్ని ఖరీదు శ్రీనివాస్ వితరణ చేశారు ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభం నుండి మండల పూజలు పూర్తయ్యేంతవరకు మధిర పరిసర ప్రాంత అయ్యప్ప మాలదారులకు అయ్యప్ప స్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉచితంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో మాలదారులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. 63 రోజులపాటు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సరిపడే బియ్యాన్ని పసుర గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట రవి వారి సోదరులు వితరణగా అందజేశారు. తొలి రోజు మాలదారులకు అన్నదానాన్ని ప్రముఖ వైద్యులు సనుగుళ్ళ విజయ శ్రీనివాస్ దంపతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు స్వామివారి ఆలయంలో మండల పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో , ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువాది ధర్మారావు, చలువది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురుస్వాములు వంకాయలపాటి నాగేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్,మైనేడి జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: