తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షునిగా పసునూరి శ్రీనివాస్
Published: Wednesday August 04, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షునిగా (కన్వీనర్) అమ్మక్కపేట్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది పసునూరి శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సామాజిక రచయితల సంఘం సహ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజేశంలు నియామక పత్రాన్ని పంపించారు. గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక అంశాలపై శ్రీనివాస్ వివిధ రచనలు చేస్తూ సమాజ వికాసానికి కృషి చేస్తున్నారని, వారి రచనా శైలిని గుర్తించి జగిత్యాల జిల్లా కన్వీనర్ గా బాధ్యతలను అప్పగించినట్లు వారు ఇట్టి ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ సందర్బంగా నూతన కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సామాజిక రచయితల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర సహ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, రావుల రాజేశం లకు కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: