కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరం లాంటిది : బండి సతీష్ గౌడ్
Published: Wednesday April 20, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం పేద ఆడపడుచులకు వరం లాంటిదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండి సతీష్ గౌడ్ పేర్కొన్నారు.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ శ్రీరామ ఆర్టీసీ కాలానికి చెందిన ఉషారాణికి కళ్యాణ లక్ష్మీ చెక్కును టీఆర్ఎస్ నాయకులు బండి సతీష్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లకు ఉషారాణి కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: