గోపాలపేటలో నిరుపేదలకు సరుకులు, బుక్స్ వితరణ
Published: Friday April 22, 2022
తల్లాడ, ఏప్రిల్ 21 (ప్రజాపాలన న్యూస్): మండల పరిధిలోని గోపాలపేట గ్రామానికి చెందిన వృద్ధులకు, వితంతువులకు, చిన్నారులకు హైదరాబాద్ కు చెందిన ఆశ్రీ సొసైటీ నిర్వాహకులు పూర్ణి కిషోర్ దంపతులు చేయూతనిచ్చారు. గురువారం వృద్ధులు, వితంతువులకు నిత్యావసర సరుకులు, చిన్నారులకు బట్టలు, నోటుపుస్తకాలు, స్టేషనరిని అందజేశారు. ఈకార్యక్రమంలో ఆశ్రీ సొసైటీ నిర్వాహకులు పూర్ణి కిషోర్ దంపతులు, రాయప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this on your social network: