ఉద్యమకారుడు జెనిగా కొమరయ్యమృతదేహానికి నివాళులర్పించిన మంత్రి

Published: Sunday October 10, 2021
బాలాపూర్: అక్టోబర్ 9, ప్రజాపాలన ప్రతినిధి : నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉద్యమకారుడు  వెంకటాపురం గ్రామంలో కురువ జెనీగా కొమురయ్య లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజకీయ కురువృద్ధుడు వెంకటాపుర్ మాజీ సర్పంచ్ జెనిగ కొమురయ్య యాదవ్ పరమపదించారనీ తెలిసి అశ్రునయనాలతో  భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, తోపాటు బడంగ్పేట్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహ రెడ్డి వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బొర్రా జగన్ రెడ్డి తదితరులు పాల్గొని మృతి దేహానికి  నివాళులు అర్పించారు.