రాష్ట్రానికి బీ ఆర్ యస్, బిజెపిలు శాపంగా మారాయి వైయస్సార్ టిపి మండల నాయకులు

Published: Friday February 03, 2023

బోనకల్ ,జనవరి 2 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమని, రాష్ట్రానికి బీ ఆర్ యస్ ,బిజెపిలు శాపంగా మారాయని వైయస్సార్ టిపి మండల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ, పసుపు బోర్డు, ములుగు గిరిజన వర్సిటీ హామీల ప్రస్తావనం ఈసారి కూడా పోవడం దారుణమని, దేశంలో రెండు కోట్లు ఉద్యోగ కల్పన కనబడటం లేదని, అడగనిది అమ్మ అయినా అన్నం పెట్టదని, మన దొరగారు ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడిండా ప్రధాని రాష్ట్రానికి వస్తే విభజన సమస్యలు పట్టించుకోరా అని అడిగారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపి మధిర మండల అధ్యక్షులు దేవుని పట్ల శ్రీనివాస్ శాస్త్రి, బోనకల్ మండల వైయస్సార్ టిపి నాయకులు ఇరుగు జానేసు, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, యూత్ మండల అధ్యక్షుడు మందా నాగరాజు పాల్గొన్నారు.