రైతు బాంధవుడు కేసీఆర్..... ప్రతి రైతుకి రైతుబంధు.. హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామ

Published: Thursday December 29, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ పథకం రైతులకు ఎంతో మేలును చేకూరుస్తుందని. ప్రతి ఎకరానికి పదివేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతు బంధు డబ్బును రైతులకు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రైతుకి చివరి ఎకరం భూమి వరకు ,ఆ విధంగా ఈ ఏడాది రెండో విడత రైతు బంధు నగదును ఈ రోజు బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని. రాష్ట్ర ప్రభుత్వం వారం క్రితమే ఈ డబ్బును జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఈరోజు మొదటి విడతగా కొంతమందికి ఈ రైతు బందు నగదు ఖాతాల్లో కి వచ్చాయని .మొదటగా తక్కువ ఎకరాలున్న భూయజమానులు ఈ పథకం కింద డబ్బు జమవుతుందని. మొత్తం అందరికి ఒకటో తారీకు లోపు ఈ డబ్బు జమ కాబోతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా ఈ పథకం వల్ల రైతు బాగు కోరుతున్న కేసీఆర్ కి రైతులు నీరాజనాలు పలుకుతున్నారు.గత యాసంగి సీజన్ కంటే ఎక్కువమంది ఈ సీజన్ లో రైతు బందును ఎక్కువగా అందుకోబోతున్నారని . డిసెంబర్ 20 నాటికి భూములు కొన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని మొత్తంగా ఈ సీజన్ లో రూ.7,676 కోట్ల నగదులు రైతులు పొందబోతున్నారు. నిజంగా ఈ పథకం ఇప్పుడు రైతులు కొత్త సంవత్సర వేడుకల్ని ముందే తీసుకొచ్చిందని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు.