27 వ డివిజన్ లో రెండో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం

Published: Saturday July 03, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : ప్రగతి హిల్స్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటిన స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 27వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ప్రగతి హిల్స్ కాలనీలో కమిటీ హాల్ ను శుభ్రపరిచి, అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను శుభ్రపరిచి, కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటి వాటిని సంరక్షణగా చూసుకోవాలని కాలని కమిటీ అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బి జె పి ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి. కార్పొరేటర్ కీసర హరినాథ్ రెడ్డి కృష్ణారెడ్డి. మున్సిపల్ స్పెషల్ అధికారి బాబు గౌడ్, కాలనీవాసులు మల్లేష్. రామ్ రెడ్డి. భాస్కర్. రాజు. శ్రీను. సత్తయ్య. గోపాల్. మహేష్. కన్నా. రాము. కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.