ఇంజనీర్ లను ఘనంగా సత్కరించిన పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడ

Published: Thursday September 16, 2021
హైదరాబాదు 15 సెప్టెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : ఇంజనీర్స్ డే సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను ఘనంగా సత్కరించిన పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజయ్య తాల్క. భారతరత్న సర్.మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162వ జయంతి వేడుకలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ సబ్ డివిజన్ నారాయణ్ ఖేడ్ మరియ సిర్గాపూర్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజయ్య తాల్క అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు యల్.మల్లయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ రోడ్లు మరియు భవనాల శాఖ (విశ్రాంత ఇంజనీర్)  ప్రస్తుతం  పంచాయతీ రాజ్ శాఖ  బ్రిడ్జి కన్సల్టెంట్ మరియు సంగారెడ్డి జిల్లా కార్యనిర్వహక ఇంజనీర్ తుమ్మలపల్లి జగదీశ్వర్ లు ముఖ్య అతిథిలుగా హాజరైనారు. తదనంతరం కార్యాలయంలో యల్.మల్లయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ రోడ్లు మరియు భవనాల శాఖ,  సంగారెడ్డి జిల్లా కార్యనిర్వహక ఇంజనీర్ తుమ్మలపల్లి జగదీశ్వర్ మరియు ఇతర ఇంజనీర్లను ఇంజనీర్స్ డే సందర్భంగా  అంజయ్య తాల్క అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.కొండయ్య డిఇఇ, జి.విజయ్ కుమార్ సైట్ ఇంజనీర్, ప్రవీణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్, నర్సింహులు జెటిఒ, సాయి గౌడ్ జెటిఒ, షఫియొద్ధిన్ టెక్నికల్ అసిస్టెంట్, మహమ్మద్ బషీర్, రాంచందర్, శ్రీనివాస్ ఆఫీస్ సబార్డినేట్స్ మరియు కాంట్రాక్టర్లు రాపూరి హరి, కిష్టాపూర్ రవి వివిధ గ్రామాల సంర్పంచులు మొదలగు వారు పాల్గొని ఇంజనీర్స్ డే ను విజయవంతం చేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఘనంగా సన్మానం