శ్రమదానంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి ఆంజనేయులు.

Published: Monday June 06, 2022
తల్లాడ, జూన్ 5 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, ఫిషరీష్ ఏడీ  ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం ఆయన గ్రామంలో ఉన్న రోడ్లను కలియతిరిగారు. రోడ్ల పక్కన ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే క్రమంలో ఆయన శ్రమ దానం చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పల్లె ప్రకృతిలో భాగంగా రోడ్లవెంబడి ఉన్న చెత్త చెదారం, డ్రైనేజీలు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, సెక్రెటరీ ఇజాజ్, ఉప సర్పంచ్ సీతారాములు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు,  మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, శెట్టిపల్లి చంద్రయ్య, కళ్యాణపు వెంకటయ్య, కళ్యాణపు కృష్ణయ్య, శ్రీను, గ్రామస్తులు ఉన్నారు.*