వి. వి. పాట్ల భద్రతకు పటిష్టమైన చర్యలు ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు **
Published: Wednesday March 01, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 28 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో వి.వి. పాట్ల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వి.వి. పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వి.వి పాట్ల భద్రతకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని, గోదాము సి.సి. కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. రాజేశ్వర్, ఆసిఫాబాద్ మండల తహసిల్దార్ రాంమోహన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: