కటకం గణేష్ ను సన్మానించిన జర్నలిస్టులు
Published: Wednesday August 11, 2021
కోరుట్ల, ఆగష్టు 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణానికి చెందిన కోరుట్ల సిటీ కేబుల్ రిపోర్టర్ మరియు రక్తదాన అనుసంధాన కర్త కటకం గణేష్ సేవలను గుర్తించి తోటి జర్నలిస్టులు అతను చేస్తున్న కృషిని గమనించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తోటి రిపోర్టర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతోమంది జర్నిస్టులు తమ ప్రాణాలు కోల్పోయిన తను అధైర్య పడకుండా అధికారుల మరియు నాయకుల వార్తలను సేకరించి ప్రజల వద్దకు తీసుకువెళ్లి చైతన్యవంతులు గా చేశారు అలాగే గత 14 సంవత్సరాలుగా అందిస్తున్న రక్తదాన సేవలు ఇప్పటివరకు 3900 లకు పైగా రక్త దానాలు చేయించి ఎంతోమందికి ప్రాణదాత గా నిలిచారు గణేష్ చేస్తున్న కృషిని గుర్తించి అభినందిస్తూ జర్నలిస్టులు గణేష్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీ, బాణాల శ్రీధర్, అల్లం రాజేష్, ముక్రమ్, వాషిద్, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: