తాసిల్దార్ కు అభినందనలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday August 17, 2021
మధిర, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ జిల్లాలో ఉత్తమ తాసిల్దార్ గా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న మదిర తాసిల్దార్ దొడ్డా రపు సైదులు ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు బాలరాజు నాయకులు కర్నాటి రామారావు, సైడెల్లిపురం సర్పంచ్ చిట్టి బాబు, సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, ఆదిమూలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు