అత్యవసర సమయంలో రక్తానదానం చేసిన ఏబీవీపీ నగర కార్యదర్శి మడవేని సునీల్

Published: Saturday January 28, 2023

కోరుట్ల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి):
కథలాపూర్ మండలం తాండ్రయాల గ్రామానికి చెందిన ఓ గర్భిణీ స్త్రీ కి తన ఆపరేషన్ నిమిత్తం A పాజిటివ్ రక్తం అవసరం కాగా విషయం తెలుసుకున్న పూర్వ ఏబీవీపీ నాయకులు చిప్ప మహంత్   కోరుట్ల ఏబీవీపీ నగర కార్యదర్శి సునీల్ ని ఆశ్రయించగా వెంటనే స్పందించి రక్తదానం చేశారు. అనంతరం పలువురు  స్పందిస్తూ విద్యార్ధి ఉద్యమాలతో పాటుగా సామాజిక సేవ చేస్తున్న సునీల్ నీ అభినందించారు.