మానవత్వం చాటుకున్న మిత్రులు

Published: Wednesday April 28, 2021

గుమ్మడిదల, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : తమ మిత్రుడు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకున్న మిత్రులందరూ కలిసి తమ మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాలలోకి వెళితే గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన చిన్నపోచి కొమురేష్ అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలుసుకున్న 2003-2004 సంవత్సరంలో గుమ్మడిదల మండల కేంద్రంలో పదవ తరగతి చదువుకున్న స్నేహితులందరూ కలిసి తన స్నేహితుని కుటుంబానికి రూ 21000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.