మానవత్వం చాటుకున్న మిత్రులు
Published: Wednesday April 28, 2021
గుమ్మడిదల, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : తమ మిత్రుడు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకున్న మిత్రులందరూ కలిసి తమ మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాలలోకి వెళితే గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన చిన్నపోచి కొమురేష్ అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన విషయం తెలుసుకున్న 2003-2004 సంవత్సరంలో గుమ్మడిదల మండల కేంద్రంలో పదవ తరగతి చదువుకున్న స్నేహితులందరూ కలిసి తన స్నేహితుని కుటుంబానికి రూ 21000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Share this on your social network: