పాఠశాలలను సందర్శించిన డీఈవో సోమశేఖర్ శర్మ..

Published: Friday January 06, 2023
తల్లాడ, జనవరి 5 (ప్రజా పాలన న్యూస్): 
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల విద్యా బోధన, విద్యార్థుల సామర్థ్యం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, సరోజిని, ఉపాధ్యాయులు మాదినేని నర్సింహారావు, ఉన్నారు.