సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Monday August 29, 2022

మేడిపల్లి ఆగస్టు 28 ప్రజా పాలన ప్రతినిధి

ఉప్పల్ డివిజన్లోని విజయపురి కాలనీ మరియు సౌత్ స్వరూప్ నగర్ కాలనీ లలో  ఉప్పల్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సహాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని     మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఆకుల మహేందర్ జన్మదినం సందర్భంగా హరితహారంలో భాగంగా  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే ఆకుల మహేందర్ ను శాలువతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకుల మహేందర్  చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ  కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ఉప్పల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాషాపల్లి నిరంజన్ చారి, అన్య బాలకృష్ణ, రామ్ రెడ్డి, స్థానిక కాలనీలవాసులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,గరిక సుధాకర్, బన్నల ప్రవీణ్ ముదిరాజ్ , నాగేశ్వరరావు, మేకల మధుసూదన్ రెడ్డి,చింతల నరసింహారెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, ఈగ సంతోష్,ఈరెల్లి రవీందర్ రెడ్డి, పంగ మహేందర్రెడ్డి, సాయిరాజ్ రెడ్డి, నేమురీ మహేష్ గౌడ్, కొండల్ రెడ్డి, కృష్ణమాచారి ,శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాలనీల వాసులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.