ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Published: Tuesday November 15, 2022
మేడిపల్లి, నవంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 
25వ డివిజన్లోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక కార్పొరేటర్  దొంతిరి హరిశంకర్ రెడ్డి ( పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు)  బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులందరికీ బిస్కెట్లు, చాక్లెట్స్ అందజేసి విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
అనంతరం పాఠశాలలో నియమించిన ఇద్దరు విద్యా వాలంటీర్లుకు రూ 20,000/ శాలరీని అందజేశారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.