డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరులో కలెక్టర్ రవికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతి...

Published: Wednesday May 26, 2021
జగిత్యాల, మే 25 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరులో జిల్లా కలెక్టర్ రవి కి వినతి పత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల రూరల్ మండల్ అంతర్గాం గ్రామ పంచాయతీకి ఉమ్మడిగా ఉన్నప్పుడు 100 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇందులో నుండి 44 ఇండ్లను ప్రారంభించలేదు. ప్రస్తుతం వడ్డెరకాలనీ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడంతో అంతర్గాం గ్రామ పంచాయతీలో మిగిలిన 44 ఇండ్ల నుండి 24 ఇండ్లను ఒడ్డెరకాలని గ్రామ పంచాయతీకి కేటాయించి మిగిలిన 20 ఇండ్లను అంతర్గాం గ్రామ పంచాయతీ 60 - సి క్రింద కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. మరియు ఒడ్డెరకాలని గ్రామ పంచాయతీకి కేటాయించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను రాయికల్ మండల్ జగన్నాథ్ పూర్ ఎస్టీ గ్రామ పంచాయతీకి కేటాయించగలరని కలెక్టర్ కు విన్నవించారు. అదేవిధంగా అంతర్గాం మరియు రాయికల్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కాంట్రాక్టర్ సరిగా పని చేయనందున అతన్ని తొలగించి అర్హత కలిగిన కాంట్రాక్టర్ 60- సి పనుల క్రింద అప్పగించగలరని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.