పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
Published: Saturday June 11, 2022
మేడిపల్లి, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో స్థానిక సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లోని సాయి క్రిష్ణ నగర్ ,కెసిఆర్ నగర్ కాలనీలలో ఉప్పల్ మున్సిపల్ వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యేే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు
పాల్గొన్నారు. సాయి క్రిష్ణ నగర్ ,కెసిఆర్ నగర్లలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు ,దోమల నివారణకు చర్యలు, కాలని పరిసరాల పరిశుభ్రత , సాయి క్రిష్ణ నగర్ ,కెసిఆర్ నగర్లలో డ్రైనేజీ ,రోడ్లు , త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ సూచించారు. అదేవిధంగా సాయి క్రిష్ణ నగర్లో స్మశాన వాటిక ,ఖాళీ స్థలాల పరిరక్షణకోసం అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ లతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిసి అరుణ కుమారి, ఈఈ నాగేందర్, డీ.ఈ.నాగమణి, ఎఈ జ్యోతి ,టౌన్ ప్లానింగ్ ఎ సి పి వెంకటరమణ, జలమండలి అధికారులు మేనేజర్ ప్రభాకర్ , విద్యుత్ అధికారులు ఖాజా టిఆర్ఎస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: