వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం
Published: Tuesday November 15, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన:
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని సోమవారం మంచిర్యాల లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల లోని 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు మానసిక వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వాసవి క్లబ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ , వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి రాజు, డాక్టర్ విష్ణువర్ధన్, చందూరి మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: