వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

Published: Tuesday November 15, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన: 
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్  నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని సోమవారం మంచిర్యాల లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని  వాసవి క్లబ్ ఆధ్వర్యంలో  పాఠశాల లోని 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ  చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు మానసిక వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వాసవి క్లబ్    క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ , వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలుమాసు ప్రవీణ్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి రాజు,  డాక్టర్ విష్ణువర్ధన్, చందూరి మహేందర్,   ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.