స్వర్గీయ ఇంద్రారెడ్డి కి నివాళి అర్పించారు

Published: Tuesday October 05, 2021
బాలాపూర్, అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజల మనిషి స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా చేవెళ్ల కౌకుంట్ల గ్రామంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఐనటువంటి ఇంద్రారెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మీర్పేట్ కార్పొరేషన్ టి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షురాలు సిద్దల లావణ్య, మీర్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ ముద్ద పవన్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు పల్లె జంగయ్య, టిఆర్ఎస్ నాయకులు బండి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.