కుందనికకు క్రీస్తు సంఘములు 32 వేలు సహాయం..
Published: Monday March 06, 2023
తల్లాడ(పెనుబల్లి), మార్చి 5 (ప్రజాపాలన న్యూస్):
సత్తుపల్లి మండలం ఎన్. టి. ఆర్. నగర్ గ్రామ కాపురస్థులు రేపాని పూర్ణచ్చదరావు, లక్ష్మి తిరుపతమ్మ దంపతుల కుమార్తే కుందనిక కాలేయ వ్యాధితో బాధపడుతుందని తెలిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అలవాల కరుణాకర్ ఆధ్వర్యంలో ఎన్. టి. ఆర్. నగర్ క్రీస్తు సంఘము వారు 22 వేలు, రాజీవనగర్ క్రీస్తు సంఘము వారు 10 వేలు ఆదివారం మధ్యాహ్నం ఎన్. టి. ఆర్. నగర్ క్రీస్తు సంఘ ప్రార్ధనా మందిరములో స్థానిక సువార్తికులు అలవాల కరుణాకర్, లక్ష్మి దంపతుల చేతుల మీదగా, సంఘ పెద్దల సమక్షంలో కుందనిక తల్లి దండ్రులకు అందించారు.
ఈ కార్యక్రమములో తడికమళ్ళ. ప్రకాశరావు, కొత్తపల్లి ప్రభాకర్, నల్లగట్ల భాస్కర్రావు, నూతక్కి. నవకుమార్, ఐనపనూరి. నాగేశ్వరావు, బాలు, జార్జీ, శ్రీహరి, పుల్లారావు, కిష్టారం కుమార్, ఇశ్రాయేలు, నాగరాజు, జయరాజు, కుమారాజా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: