పార్క్ స్థలం ఆక్రమించిన కౌన్సిలర్ భర్త

Published: Tuesday March 08, 2022
16వ వార్డు గంగారం ప్రజలు
వికారాబాద్ బ్యూరో 07 మార్చి ప్రజాపాలన : పార్క్ కొరకు కేటాయించిన స్థలాన్ని కౌన్సిలర్ భర్త ఆక్రమించారని 16వ వార్డుకు చెందిన గంగారం ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ కు సోమవారం ఫిర్యాదు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిలర్ భర్త కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బూతులు తిడుతున్నారని ఆరోపించారు. పార్క్ స్థలాన్ని ఎందుకు ఆక్రమిస్తున్నారని 16వ వార్డు ప్రజలు కౌన్సిలర్ భర్తను అడిగితే మీరు ఎవరికి చెబుకుంటారో చెప్పుకోండని బెదిరిస్తున్నారని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. కౌన్సిలర్ భర్త పార్క్ స్థలాన్ని ఆక్రమిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ కు నేరుగా ఫిర్యాదు చేశామని వార్డు ప్రజలు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కి, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపామని స్పష్టం చేశారు.