గుండె పోటుతో మృతి చెందిన ఎన్కతల సుమన్
Published: Thursday February 10, 2022
పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 09 ఫిబ్రవరి ప్రజాపాలన : గుండె పోటుతో మృతి చెందిన ఎన్కతల సుమన్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశామని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో ఎన్కతల సుమన్ (34) మృతి చెందిన సమాచారం మేరకు ఎంపిటిసి స్వప్న సురేష్, మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్ మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుమన్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని గుర్తు చేశారు. మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సుమన్ ఇంత తొందరగా మృత్యువు ఒడిలోకి చేరడం విచారకరమన్నారు. కాలనీ వాసులతో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే సుమన్ లేడన్న విషయం జీర్ణించుకోలేక కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకున్నారు.
Share this on your social network: