తిరుమలకుంటలో ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ.

Published: Friday February 05, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రజాపాలన ఫిబ్రవరి 5
 
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గురువారం నాడు RSS విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య  రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక హిందూ బంధువు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు యువకులు కలిసి శ్రీ రామ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.. అనంతరం రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సహాయం అందించి భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో విరాళాలను సేకరించారు.. అందులో భాగంగా తిరుమలకుంట గ్రామానికి చెందిన గడ్డం పుల్లారావు దంపతులు రామ మందిర నిర్మాణం కోసం 1000 రూపాయలు విరాళం ఇచ్చారు. రామమందిర నిర్మాణార్థం గడపగడపకు విరాళాల సేకరణ విషయం తెలియపరిచి హిందువుని భాగస్వామిని చేయాలని ఆర్ ఎస్ ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట RSS విశ్వ హిందూ పరిషత్ శేఖ చవ్వా రమేష్, సిహెచ్ నిరంజన్ దాస్, శివ కుమార్, తిరుమలకుంట ఆలయ ప్రెసిడెంట్ కంచర్ల లక్ష్మి నారాయణ, తిరుమకుంట ఆర్ఎస్ఎస్ శేఖ పర్సా రమేష్, దాసరి వెంకన్న బాబు, రామాలయం పంతులు రమేష్ చంద్ర చార్యులు, రామాలయ కమిటీ సభ్యులు పానుగంటి శ్రీను, కోన శ్రీను, సత్తిపండు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
 
ఫోటో: విరాళం అందిస్తున్న గడ్డం పుల్లారావు దంపతులు