యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం

Published: Tuesday June 21, 2022
జనశిక్షన్ సంస్థాన్ డైరెక్టర్ వై. రాధాకృష్ణ
తల్లాడ, జూన్ 20 (ప్రజాపాలన న్యూస్): 
ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా జనశిక్షన్ సంస్థాన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో బీరోలు, సుబ్లేడు, బంచోడు, నాయకన్ గూడెం, పొద్దుటూరు, బస్వపురం, టి యల్ పేట, గుబ్బగుర్తి, కొత్త వెంకటగిరి, కుప్పెనకుంట్ల, ఖమ్మం లో నిర్వహిస్తున్న ఉచిత స్వయం ఉపాధి కల్పన సెంటర్స్ లో యోగ దినోత్సవ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ సందర్భంగా యోగ యొక్క విశిష్టత గురించి వివరించారు. అనంతరం జేఎస్ఎస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి రోజు యోగ చేయడం వలన అన్ని రకాల వ్యాధుల నుండి, చెడు వ్యాసనాలనుండి, మానసిక రుగ్మాతల నుండి ప్రతికూల పరిస్థితులనుండి బయట పడి సంతోషంగా జీవితంను కొనసాగించవచ్చునన్నారు.  భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలతో "ఆజాదీ  కా అమృత్ మహోత్సవం అనేభాగంలో ఈ గొప్ప వేడుక సందర్బంగా మనమందరం ప్రతి రోజు యోగ చేద్దాము, అందరమూ సంతోషంగా ఉందాము అని ప్రతిజ్ఞ చేద్దాం అని జె యస్ యస్ సెంటర్ లలో లబ్ధిదారులకు డైరెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో  రిశోర్స్ పర్సన్స్ కవిత, జాస్మిన్, కైరున్నిసా బేగం, రమాదేవి, వైష్టవి, మహిళా మండలి అధ్యక్షులు రజియా పాల్గొన్నారు.