ఘనంగా మడుపల్లి లో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు.

Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి లో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.