ఘనంగా మడుపల్లి లో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు.
Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి లో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.
Share this on your social network: