అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాల‌న్న ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Saturday October 01, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా   ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
వివిధ శాఖలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే  సమీక్షించారు.గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మండలంలోని ఎంపిటిసిలకు ఒకొక్కరికి గ్రామాలభివృద్ది కొరకు రూ.5లక్షల చొప్పున నిధులను ఎమ్మెల్యే  కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు
కార్యక్రమంలో ఎంపిపి పి.కృపేష్, జడ్పిటిసి మహిపాల్, వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ఎంపిడిఓ జైరామ్ విజయ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు బి. రాంరెడ్డి, ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు భరత్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.