బహుజన సమాజ్ పార్టీలో కి ఆహ్వానించారు
Published: Wednesday December 08, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం మేటిళ్ల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్య అతిధి రంగారెడ్డి జిల్లా Ec మెంబర్ చెరుకూరి రాజు గారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ మేటిళ్ల గ్రామానికి చెందిన గుంటి రవి S/0 సత్తయ్య ని ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ గా నియామక పత్రం అందజేసిన అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ గారు. ఈ కార్యక్రమంలో. చెరుకు భరత్ రాజ్, గుంటి శివ కుమార్, నాగటి ప్రవీణ్ కుమార్, చెరుకూరి చిన్నూ పాల్గొన్నారు.
Share this on your social network: