వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Published: Monday August 16, 2021
జిన్నారం, ఆగస్టు15 (ప్రజాపాలన ప్రతినిధి) : జిన్నారం మండల వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిన్నారం మండల కేంద్రంలోని తాహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దశరథ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, స్థానిక పోలీస్ స్టేషన్ లో సి ఐ లాలూ నాయక్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, యువజన సంఘాలు పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. వాడవాడలా త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు.