అయ్యో పందులు బాబోయ్ మా గోడూ వినండి
Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీలో పందులు నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని అన్ని వార్డు కౌన్సిలర్ ఏరియాల్లో రాజీవ్ నగర్లో సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ కి సాయిబాబా గుడి అయ్యప్ప స్వామి గుడి శివాలయం రోడ్డు అన్ని ఏరియాల్లో విచ్చలవిడిగా పందులు బాబోయ్వెరహదారిలో నిరంతరం పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని ఆప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులను పందులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూలుకు వెళ్ళే విద్యార్థులపై పందులు ఎప్పుడు దాడి చేస్తాయో నని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పందుల నిర్మూలనకు కృషి చేయాలన్నారు.
Share this on your social network: