*అవినీతి లొసుగులను వెలికి తీసే వారదులే పాత్రికేయులు*

Published: Thursday January 19, 2023


చేవెళ్ల జనవరి 18 ప్రజా పాలన):-

ఏలాంటి పక్షపాతాలు లేకుండా ఉన్నట్టు నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ నూతన  వరవడితో కు చేరువైన  నిజం న్యూస్ దిన పత్రిక అని  బండారి శైలజ నాగిరెడ్డి అన్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిజం న్యూస్ క్యాలెండర్ ను సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం,కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి గుండాల రాములు, టిపిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వీరేందర్ రెడ్డి, పెంటయ్య గౌడ్,గెస్ట్ హౌస్ లో నిజం న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ...
పత్రిక ప్రజాస్వామ్యన్ని మేల్కొల్పడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అక్రమాలను, అన్యాయాల, వెలికి తీసి అక్రమార్కుల వెన్నువిరుస్తుందని. సత్యం న్యాయం దర్మం వెనుక నిలిచి హింస తెలియని రక్తం చూడని ఖడ్గం కలమె అన్నారు. పత్రికలు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తుందని అన్నారు.పత్రికలు అన్ని ప్రజల పక్షాన ఉండాలని కోరారు. అతి తక్కువ కాలంలో నిజం  న్యూస్ పత్రిక ప్రజాదారణ పొందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు నాలుగవ పాదం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ,ఉప సర్పంచ్ గంగి యాదయ్య, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, పెంటయ్య గౌడ్, అత్తిలి రవీందర్ రెడ్డి,పాండు, దేవేందర్, యాదయ్య,మహేష్,రవీందర్,నర్సింలు,నరేందర్, శేఖర్ , రామచంద్రయ్య,తిల్లు, తదితరులు పాల్గొన్నారు