ఎన్ ఐ ఎన్ కాలనీ ఫేస్ 1 నూతన అధ్యక్షుడిగా సాయి రెడ్డి వెంకట్ రెడ్డి

Published: Saturday March 20, 2021
మేడిపల్లి, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి)  ఎన్ ఐ ఎన్ కాలనీ  నందు గల  సర్వే నెంబర్ 93 నీ కొత్తగా ఎన్ ఐ ఎన్ కాలనీ ఫేస్ -1 గా ప్రత్యేక కొత్త కాలనీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కాలనీ నూతన అధ్యక్షుడిగా  సాయి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వై శ్రీహరి, జనరల్ సెక్రెటరీగా సతీష్ కుమార్, జాయింట్ సెక్రటరీగా డి రవీందర్ రెడ్డి, మరియు ఆంజనేయులు నియమితులయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సిహెచ్ తిరుపతి రెడ్డి, జి బిక్షం చారి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, ఎ మల్లేష్ యాదవ్, బాలాజీ నాయక్, రవీందర్ రెడ్డి, ఎ సత్యనారాయణ యాదవ్, జి బిక్షమయ్య గౌడ్, పి బాల్ రెడ్డి మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు.