నేడు జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి

Published: Friday March 26, 2021
మధిర పట్టణ  అఖిలపక్ష నాయకులు పిలుపు
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ రేపు మధిర పట్టణ  బంద్ కు అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు, వర్తక వాణిపారులు, హోటల్స్, ఆటోలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్ లు, ప్రజలు సహకరించి బంద్ ను జయప్రదం చేయాలని  అఖిలపక్షం నాయకులు కోరారు.. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల రమణగుప్త, సిపిఐ సిపిఎం పట్టణ కార్యదర్శులు బెజవాడ రవిబాబు, శీలం నరసింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చవా వేణు, టిడిపి పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, పుల్లారావు, మంద సైదులు, షైక్ జహంగీర్, కోరంపల్లి చంటి తదితరులు పాల్గొన్నారు.