మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత

Published: Monday January 30, 2023
శంకరపట్నం జనవరి 29 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం గద్దపాక గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కనుకుంట్ల కమలమ్మ ఇటీవలే చనిపోగా ఆదివారం కమలమ్మ కుటుంబ సభ్యులకు గద్దపాక యూత్ సభ్యులు 50 కిలోల బియ్యాన్ని వారి ఆదరణగా అందజేశారు. గ్రామంలో గత కొంతకాలంగా ఎవరు చనిపోయిన వారి కుటుంబానికి అండగా ఓదార్పుగా గద్దపాక యూత్ సభ్యులు వారికి తోచినంతగా 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.