హరిజనవాడ హైస్కూల్ లో పిల్లలకు పరీక్షకు సంబంధించిన అట్టలు పెన్నులు వితరణ

Published: Wednesday April 27, 2022
మధిర ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు శ్రీ పుల్లఖండం చంద్రశేఖర్, హరిజనవాడ హైస్కూల్ 10వ క్లాస్ 49 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్, పెన్సిల్, రబ్బర్, షార్ప్ నర్, హాల్ టికెట్ పెట్టే పోచ్, స్టార్ చాక్లెట్ పంచి, వచ్చే నెలలో జరుగబోయే పబ్లిక్ పరీక్షలలో మంచి రాంక్ లు తెచ్చుకుని, ఉన్నత విద్య అభ్యసించి, జీవితంలో ఉన్నతస్థాయికెదిగి తమ కుటుంబాలకు, సమాజాభి వృద్దికి వెన్నుదన్నుగా నిలవాలని కోరుతూ, శుభాకాంక్షలు అందచేశారు. ఈ కార్యక్రమంలో, రిటైర్డ్ ఎమ్.డి.ఓ. మాధవరపు నాగేశ్వరరావు, చంద్రశేఖర్  మనవడు అక్షయ్ కార్తీక్, మనవరాలు సాన్విక, హెచ్.ఎమ్. విజయశ్రీ మేడం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.