సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయండి

Published: Monday December 13, 2021
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 12 డిసెంబర్ ప్రజాపాలన : కాంగ్రెస్ సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ఆన్లైన్లో సభ్యత్వం నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా రెండ్రోజుల్లోనే తమ బూత్లలో 200 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను సన్మానించారు. ధారూర్ స్టేషన్ గ్రామానికి చెందిన విజయ్,
ఎబ్బనూరు గ్రామానికి చెందిన భూపాల్ అంతారం గ్రామానికి చెందిన నరేంద్రను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ధారూర్  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి  నాయకులు రఘుపతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు