గ్యాస్ ధరలకు నిరసనగా టిఆర్ఎస్ రాస్తారోకో
Published: Friday March 03, 2023
శంకరపట్నం మార్చి02 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు, అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని దుయ్యబట్టారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: