రాష్ట్రపతివిశిష్ట సేవా అవార్డు గ్రహీతకు ఫైర్ స్టేషన్ సిబ్బంది సన్మానం మధిర రూరల్
Published: Wednesday August 24, 2022
ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రపతి విశిష్ఠ సేవా అవార్డు గ్రహీతవెంకటేశ్వరరావు కి సిబ్బంది ఘన సన్మానంఎంప్లాయిస్ కాలనీ నందుగల ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న యర్రగుంట వెంకటేశ్వరరావు కి ఫైర్ సిబ్బంది ఘన సన్మానం చేశారు గత 35 సంవత్సరాలుగా ఫైర్ మాన్ గా లీడింగ్ ఫైర్ మాన్ గా విశిష్ఠ సేవలందించినటువంటి వెంకటేశ్వరరావు సేవలను సిబ్బంది కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ మెన్ బి రాంబాబు, ఫైర్ మెన్లు బి నాగేశ్వరరావు బి అనంతరామిరెడ్డి, బి భాస్కర్, ఎం సతీష్, టి మోహన్, హోమ్ గార్డ్స్ కె రాంప్రసాద్,సిహెచ్ సర్వేశ్వరరావు, డ్రైవర్ ఆపరేటర్లు జి శ్రీను, కె చెన్నారావు, స్వీపర్ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: