బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత ను కలిసిన బి ఎస్ పి నాయకులు
Published: Monday December 13, 2021
అనంతరం బి ఎస్ పి బోనకల్ మండల కమిటీ ఎన్నిక
బోనకల్, డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలంలో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమీక్షా సమావేశంలో బాగంగా మధిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దామెర్ల పృద్వి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంలో బాగంగా బి ఎస్ పి మండల కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. అనంతరం బోనకల్ ఎస్ ఐ తేజవత్ కవిత ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్ ఎస్ పి జ్ఞానయోధ పుస్తకంను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మదిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దామెర్ల పృద్వి, బి.ఎస్.పి బోనకల్ మండల అధ్యక్షులు గార్లపాటి రవి, ప్రధాన కార్యదర్శి నిమ్మతోట ప్రణయ్, ఉపాధ్యక్షులు పేరబత్తిని కృష్ణ, కర్లకుంట రాజేష్, కృష్ణ, దుర్గ, తిరు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: