బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత ను కలిసిన బి ఎస్ పి నాయకులు

Published: Monday December 13, 2021
అనంతరం బి ఎస్ పి బోనకల్ మండల కమిటీ ఎన్నిక
బోనకల్, డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలంలో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమీక్షా సమావేశంలో బాగంగా మధిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దామెర్ల పృద్వి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంలో బాగంగా బి ఎస్ పి  మండల కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. అనంతరం బోనకల్ ఎస్ ఐ తేజవత్ కవిత ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్ ఎస్ పి జ్ఞానయోధ పుస్తకంను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మదిర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దామెర్ల పృద్వి, బి.ఎస్.పి బోనకల్ మండల అధ్యక్షులు గార్లపాటి రవి, ప్రధాన కార్యదర్శి నిమ్మతోట ప్రణయ్, ఉపాధ్యక్షులు పేరబత్తిని కృష్ణ, కర్లకుంట రాజేష్, కృష్ణ, దుర్గ, తిరు తదితరులు పాల్గొన్నారు.