సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం పాటించాలి

Published: Monday September 13, 2021
బెల్లంపల్లి పట్టణ బిజెపి అధ్యక్షుడు కోడి రమేష్ 
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని పాటించాలని బెల్లంపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విమోచన దినం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మలిదశ ఉద్యమంలో అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే దాట వేశారని అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నిర్మల్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా నిర్మల్ లో జరగబోయే సభకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, భాజపా సీనియర్ నాయకులు రేవెల్లి రాజలింగు, జీదుల రాములు, తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.